దేవకి వసుదేవులను కంసుడు బంధించడానికి కారణం నారదుడేనా….

దేవకి వసుదేవులను కంసుడు బంధించడానికి కారణం నారదుడేనా…….

భాగవతం అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముని జీవితం. అందులో శ్రీకృష్ణుని జీవితం విచిత్రంగా ఉంటుంది. తన మేన మామ కంసుడిని వధించడానికి పుట్టే కృష్ణుని జీవితం కంస వధకు ఒక ఎత్తు అయితే కంస వధ మరొక ఎత్తు అవుతుంది. అయితే కృష్ణుని తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను కంసుడు చెరసాలలో బంధించడానికి కారణం నారదుడి ప్రమేయం ఉంది.

నారదుడు చేసే ప్రతి పని వెనుక లోక కళ్యాణం కోసం మాత్రమే ఉంటుంది. ఈ విషయం పురాణాలలో జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. దేవకీ నందులను కంసుడు చెరసాల పాలు చేయడమనే విషయం లో కూడా ఇదే దాగి ఉంది. వివరాలలోకి వెళితే….

ఒకరోజు నారద మహర్షి తన అలవాటు ప్రకారం లోకాలన్నీ తిరుగుతూ భూలోకంలో ఉన్న కంసుని దగ్గరకు వచ్చాడు. నారదడిని కంసుడు చూసి ఆహ్వానించి తన దగ్గర ఉన్న ఆసనాన్ని చూపించి కూర్చోమన్నాడు. అలాగే నారదుడికి గౌరవ మర్యాదలు చేశాడు. అప్పుడు కంసుడు నారద మహర్షి ఈ భూలోకంలో ఏమైనా విశేషాలు ఉన్నాయా అని అడిగాడు.

నారదుడు కంసుడితో ఏముంటుంది కంసా….. లోకాలలో ఎప్పుడు ఉండేవే జరిగేవే…… జరుగుతూ ఉన్నాయి. అది సరేగాని నువ్వేమో రాక్షస రాజువి….. కానీ నీ చుట్టూ కొందరు దైవ స్వరూపులు ఉన్నారని మరిచిపోయావా? అని అడిగాడు నారదుడు.

నా చుట్టూ దైవ స్వరూపులు ఉన్నారా? ఏమి మాట్లాడుతున్నావు….. నారద మహర్షి అన్నాడు.అని అడిగాడు కంసుడు అయోమయంగా.

అయ్యో కంసా…నీవు రాక్షస రాజువని నీకు చాలా తెలివి తేటలు ఉంటాయి గొప్ప సాహస వంతుడివి అనుకొన్నానే కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి తెలియదా అని నారదుడు అన్నాడు.కంసుడిని దెప్పిపొడుస్తూ….

రోషం వచ్చిన కంసుడు అసలు నువ్వేమి చెభుతున్నావో వివరంగా చెప్పవయ్యా….దేవతలను పరుగు పెట్టించగలను నేను అని అన్నాడు.అలాంటి నాకు నా చుట్టూ దైవ స్వరూపులు ఉండటం ఏంటి. నన్నేదో చేయాలని ఏదో కొత్త పథకం వేస్తున్నట్టున్నావే అని కంసుడు అన్నాడు.

ఖచ్చితంగా పసిగట్టావు కంసా……నువ్వు నీ చుట్టూ వున్న నందుడు ,ప్రజా పురంలో ఉన్న గోపికలు ,గోపాలుడు,వాసు దేవుడు,దేవకి,యాదవులు మొదలైన అందరూ సాధారణ మనష్యులే కదా అని అనుకుంటున్నావు. కానీ వాళ్లందరూ దైవ స్వరూపులే కదా ఆ విషయం తెలియకపోవడం నాకు విచారంగా ఉంది అని నారదుడు అన్నాడు.

ఏమిటి నారద నువ్వంటున్నది వాళ్లు దైవ స్వరూపం ఏంటి అని అన్నాడు కంసుడు వివరాలు తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో…..

అవును కంసా నేను చూసింది నిజం మాత్రమే కాదు నీ దగ్గర ఉన్న సేవకులు కూడా నీమీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్లు కూడా దేవతలే కదా రూపంలో నీ దగ్గర ఉన్నారు అది అన్నాడు నారదుడు. నారదుడి మాటలు కంసుడికి అయోమయంగా తోచాయి.

నారదుడు మళ్ళీ కంసుడి తో ….భూదేవి రాక్షసుల బాధ భరించలేక తన బాధ ను శ్రీ మహా విష్ణువుకు చెప్పుకుంది.ఆ శ్రీ మహా విష్ణువు ఏమో భూమి మీద అవతరిస్తానని చెప్పాడు.అయినా కంసా… నీకు నీ సంగతి తెలుసా? నువ్వు నీ మొదటి జన్మలో కాలనేమి రాక్షసుడివి.ఆ తరువాత రాక్షస జన్మలు ఎత్తుతూ వస్తున్నావు. నిన్ను ఆ శ్రీ మహా విష్ణువు ఏదో ఒక జన్మ ఎత్తి వధిస్తూ వస్తున్నాడు.ఇప్పుడు నిన్ను వధించడానికి దేవకి గర్భంలో సాక్షాత్తు శ్రీ మహా విష్ణువు జన్మించబోతున్నాడు.అని అన్నాడు.

నారదుని మాటలు కంసుడిని సూదుల్లా గుచ్చుకున్నాయి.వెంటనే దేవకి వసుదేవులను చెరసాలలో బంధించాడు. యాదవ కులాలను ఎలాగైనా సర్వ నాశనం చేయాలని అందరి పైన యుద్ధం చేశాడు.కంసుడిని ఎదురు తిరిగిన వారందరి తలలు నరికేశాడు.ఎంతో మంది రాక్షస రాజులతో స్నేహం పెంచుకున్నాడు.కంసుడి బాధలు భరించలేక యాదవులు కురు,పాంచాల,కేకయ,సాల్వ,విదర్భ,నైషధ,విదేహ,కోసల మొదలైన రాజ్యాలకు వలస వెళ్లారు.ఇలా యాదవ వంశం విచ్చిన్నమవడానికి,దేవకి నందనులను బంధించడానికి నారదుడు కారణం అయ్యాడు.

Leave a Comment